బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ యువనేతలు పార్టీ అభివృద్ది కోసం సైనికుల్లా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి లింగాల కమలరాజు అన్నారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బోనకల్లు మండల యువత అధ్యక్షుడిగా తూటికుంట్ల గ్రామానికి చెందిన కన్నేటి సురేష్, ముష్టికుంట్ల గ్రామానికి చెందిన షేక్ నజీర్ కార్యదర్శిగా ఎంపిక చేస్తూ నియామకపత్రాలను జిల్లా అధ్యక్షులు చింతనిప్పు కృష్ణచైతన్య చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో యువకులను చైతన్యపరిచేందుకు కృషిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ పటిష్టతకు పాటుపడాలని సూచించారు. వీరి ఎంపిక పట్ల టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చేబ్రోలు మల్లికార్జునరావు,మోదుగుల నాగేశ్వరరావు, టీఆర్ఎస్ పార్టీ మాజీఅధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, మండల కమిటీ సభ్యులు, గ్రామఅధ్యక్ష, కార్యదర్శులు హర్షం వ్యక్తం చేశారు.