బోనకల్లు : రాష్ట్రంలో ప్రతి ఇంటికి సీఎం కేసీఆర్ ప్రవేవపెట్టిన పథకాలు అందాయని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని రైతువేదికలో సీఎం రిలీఫ్ఫండ్ చెక్కులను బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలు పూర్తిస్థాయిలో అమలవుతున్నాయని అన్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం బాధిత కుటుంబాల కోసం కేసీఆర్ సీఎం రిలీఫ్ఫండ్ ద్వారా వారికి ఆర్థిక సాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రి పాలై ఆర్థిక స్థోమత లేని వారికి సీఎం రిలీఫ్ఫండ్ ఆసరాగా నిలిచిందన్నారు.
సీఎం రిలీఫ్ఫండ్ తెలియని వారు ఉంటే వారికి తెలియజేసి దరఖాస్తు చేసుకునే విధంగా తెలియజేయాలని సూచించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బోనకల్లు గ్రామఅధ్యక్షులు గుండపునేని సుధాకర్రావు, జానకీపురం అధ్యక్షుడు భూపతితో పాటు, మరికొన్ని గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, రైతుసమితి మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్, బాణోతు కొండ, చిలకా వెంకటేశ్వర్లు, చావా వెంకటేశ్వరరావు, భుక్యా సైదానాయక్, కొనకంచి నాగరాజు, యార్లగడ్డ రాఘవ, తోటపర్తి హైమావతి, తన్నీరు రవికుమార్, కన్నేటి సురేష్, మండల నాయకులు, గ్రామఅధ్యక్ష, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.