బోనకల్లు: శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా బోనకల్లులో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం పూజలు నిర్వహించారు. అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మండలంలో అన్ని గ్రామాల్లో బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సర్పంచ్ భుక్యా సైదానాయక్, టీఆర్ఎస్ గ్రామఅధ్యక్షుడు గుండపునేని సుధాకర్రావు, యార్లగడ్డ చిన్ననరసింహా, చేబ్రోలు మల్లికార్జునరావు, చావా వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.