చింతకాని: అభినవ అంబేద్కర్ సీఎం కేసీఆర్ అని, నిరుపేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వ ఫలాలు ఉన్నాయని, దళితసాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. చింతకాని గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దళితబంధు పథకానికి మొదటివిడతగా చింతకాని మండలానికి రూ.100కోట్లు ప్రకటించడం హర్షణీయమని, సీఎం కేసీఆర్ దళితబాంధవుడని, అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని వారు కొనియాడారు.
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టుగా ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేసిన విషయం విదితమే. దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితుల దిశ మారిందని, రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ సారధ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పధకాలు అమలుచేస్తున్నారని, దళితబంధు ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీడ్స్ కార్పోరేషన్ చైర్మన్ కోండబాల కోటేశ్వరరావు, మండల, గ్రామశాఖల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, దళితసంఘాల నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, ఎంపీటీసీలు, మాజీప్రజాప్రతినిధులు, అనుబంధసంఘాల నాయకులు పాల్గొన్నారు.