ఎర్రుపాలెం: పాఠశాలలు పునఃప్రారంభమైన సందర్భంగా బుధవారం ఎర్రుపాలెం మండలంలోని మీనవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జడ్పీసీఈవో వింజం వెంకటఅప్పారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎర్రుపాలెంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని సందర్శించారు.