ఖమ్మం :నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ బాధితులకు భరోసా కల్పించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివాస్ కార్యాక్రమంలో బాధితుల నుంచి పిర్యాదులు స్వీకరించారు. ఇటీవల ఖమ్మం రూరల్ మండలం, వెంకటగిరి గ్రామానికి చెందిన మైనర్ విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన నింధితులపై చర్యలు తీసుకోవాలని మృతురాలు కుటుంబ సభ్యులు పోలీస్ కమీషనర్కు పిర్యాదు చేశారు.
దీంతో స్పందించిన కమిషనర్ వారికి భరోసాకల్పించారు. ప్రజా దివాస్ కార్యాక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 25 మంది బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చట్ట పరిధిలో వీలైనంత వేగంగా సమస్య పరిష్కారానికి సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోలకు ఆదేశాలు జారీ చేశారు.