ఖమ్మం : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ కార్యదర్శి మంజువాణి మాట్లాడుతూ సంస్కృత భాషలో ఆదికవి, శ్రీరాముని చరిత్రను అద్భుతంగా రాసిన మహానీయుడని,రామాయణాన్నిమనకు అందించిన మహర్షి అని కొనియాడారు. ఈ రోజు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం సంతోషకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ కార్యాలయం సిబ్బంది కనకవల్లి , అఖిల్, కోటేశ్వరరావు,రవిబాబు తదితరులు పాల్గొన్నారు.