ఖమ్మం :టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) దంపతులు శుక్రవారం ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు వారిని ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ సభ్యులు గాయత్రి రవిని శాలువాతో సత్కరించారు. ఈ సందర్బంగా గాయత్రి రవి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎంతో విశిష్టత కలిగిన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు లక్షలాదిమంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అన్నారు.
తెలంగాణలో ఉత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరింత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల సర్వ విఘ్నాలు తొలగి అందరూ సుభిక్షంగా ఉండాలని గణ నాథుడిని వేడుకున్నట్లు రవిచంద్ర తెలిపారు. ఈ సందర్భంగా గాయత్రి రవి దంపతులు ఖైరతాబాద్ఉత్సవ కమిటీకి లక్షా ఎనిమిదివేల రూపాయల విరాళాన్ని అందచేశారు.