ఖమ్మం : కార్మికులకు ఏ కష్టం వచ్చినా రాష్ట్ర రవాణాశాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అండగా నిలుస్తారని సుడా చైర్మన్ బుచ్చు విజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్కేవీ కార్మిక విభాగం అధ్యక్షుడు పాల్వంచ కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సభకు సుడా చైర్మన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో మంత్రి పువ్వాడ కార్మికులకు అండగా నిలిచి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారని గుర్తు చేశారు.
కార్మికులంతా ఐకమత్యంగా ఉండి సంఘం బలోపేతానికి పాటుపడాలన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్కు అత్యధిక మెజారిటీ అందించడంలో కార్మికులు ప్రముఖ పాత్ర పోషించాలని సూచించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ మక్బుల్, సీనియర్ నాయకులు నున్నా మాధవరావు, కార్మిక సంఘం నాయకులు పాషా, రుద్రగాని ఉపేందర్ తోపాటు అన్ని కార్మిక సంఘాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.