పెనుబల్లి :టీఆర్ఎస్ జెండా పండగ సంబురాలు గురువారం మండల వ్యాప్తంగా ఊరూరా రెపరెపలాడాయి. ఉప్పలచలకలో నూతనంగా ఏర్పాటు చేసిన దిమ్మె వద్ద ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జెండాను ఆవిష్కరించారు. గ్రామకమిటీల ఆధ్వర్యంలో గ్రామస్థాయిలో దిమ్మెల వద్ద జెండాలు ఆవిష్కరించగా మండల పార్టీ ఆధ్వర్యంలో వీయం బంజరు అభయాంజనేయస్వామి దేవాలయం వద్ద మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ సంక్షేమ పథకాల్లో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా నిలిచిందని, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంతోనే ఉద్యమం ఊపందుకోవడం, రాష్ట్రం ఏర్పడటం, అన్నీ టిఆర్ఎస్ నేతృత్వంలోనే జరిగాయన్నారు.
మండల పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు వంగా నిరంజన్ గౌడ్, పాలగాని శ్రీనివాసరావు, మరీదు చంద్రశేఖర్లను శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కనగాల వెంకటరావు, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్రావు, ఏఎంసీ ఛైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్రావు, నీలాద్రి దేవాలయ ఛైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, మండల ప్రధాన కార్యదర్శి భూక్యా ప్రసాద్, రైతు సమన్వయ సమితి కన్వీనర్ సోమరాజు రామప్ప, పాతకారాయిగూడెం సొసైటీ ఛైర్మన్ చింతనిప్పు సత్యనారాయణతో పాటు పలువురు మండల నాయకులు పాల్గొన్నారు.