ఖమ్మం : కొద్ది రోజుల్లో గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ తెరిచే అవకాశం ఉందని, గ్రామ పంచాయితీల సహకారంతో అన్నిపాఠశాలలను శానిటైజ్ చేయించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.కృష్ణా నాయక్ తెలిపారు. గురువారం ఖమ్మం లోని హాయ గిరిజన అభివృద్ది అధికారి కార్యాలయంలో గిరిజన సంక్షేమ శాఖ పాఠశాలల హెచ్ఎంలు, హాస్టల్ వార్డెన్లు, పీడీ, పీఈటిల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉపాధ్యాయులు అందరూ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని, గిరిజన గ్రామాలను ఉపాధ్యాయులు దత్తత తీసుకొని బడిబాట కార్యక్రమం నిర్వహించాలని అన్నారు. పీడీ,పీఈటీలు క్రీడా పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఖమ్మంలో బాల,బాలికలకు భోజన వసతితో శిక్షణ ఇస్తున్నామని, ఎక్కువ సంఖ్యలో పిల్లలు చేరేలా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ రాములు, ఏటీడీఓ ఎన్.తిరుమలరావు, టైజప్ అధికారి ఎం.కేఎల్ బాబు, తదితరులు పాల్గొన్నారు.