భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ముగ్గురి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కొంతకాలంగా వీరు దవాఖానలోని రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇటీవల ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు.
దవాఖాన సూపరింటెండెంట్ యుగేందర్, వైద్యుడు కృష్ణప్రసాద్, ఫార్మసిస్ట్ శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం సూపరింటెండెంట్ యుగేందర్, ఫార్మసిస్ట్ శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణప్రాద్ను విధుల నుంచి తొలగిస్తూ వైద్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్యుడు కృష్ణప్రసాద్ స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానను నిర్వహిస్తూ ఇంజక్షన్లను పక్కదారి పట్టించినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.