ఖమ్మం :రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్ శనివారం ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ పరిధిలో గల ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు.సెఫ్టెంబర్1 వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలోని పలు పాఠశాలలో జరుగుతున్న పారిశుధ్య పనులను వారు పరిశీలించారు. నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
అనంతరం కార్పొరేషన్ నూతన కార్యలయ నిర్మాణ పనులను వారు పరిశీలించారు.ఆతరువాత సరిత క్లినిక్ నుంచి గట్టయ్య సెంటర్ వరకు జరుగుతున్నసైడ్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా డ్రైనేజీ నిర్మాణం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ స్వరూపరాణి , కార్పొరేటర్ బుర్రి వెంకట్కుమార్, పగడాల నాగరాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.