ఖమ్మం : కొవిడ్ రోగులకు వినియోగించాల్సిన రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి అధిక ధరలకు విక్రయిస్తున్న ముగ్గురు పభుత్వ దవాఖాన సిబ్బందిని బుధవారం ఖమ్మం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.
వివరాలివి.. ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో ముగ్గురు సిబ్బంది రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టించి బ్లాక్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టాస్క్ఫోర్స్ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందడంతో నిఘాపెట్టారు.
కొవిడ్ రోగులకు ఉపయోగించాల్సిన (06) ఇంజక్షన్లను స్టాఫ్ నర్స్, మరో ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు బ్లాక్ మార్కెట్లో ఒక్కోటి రూ.38 వేల చొప్పున విక్రయిస్తున్న సమయంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ రామానుజం, సీఐ వేణు మాధవ్ , ఎస్ఐ సతీష్ కుమార్ దాడి చేసి పట్టుకున్నారు.
ఇంజక్షన్లను స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేసి ఖమ్మం టూటౌన్ పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.