రఘునాథపాలెం : మండల పరిధిలోని వీవెంకటాయపాలెం గ్రామంలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన హైస్కూల్, ప్రాథమిక పాఠశాలను సందర్శించి పాఠశాలల నిర్వహణ, సౌకర్యాల కల్పన వంటి వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యాసంస్థలు ప్రారంభం రోజు నుంచి విద్యార్ధులు ఎంతమంది హాజరవుతున్నారని ఆరా తీశారు.
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలల నిర్వహణ జరపాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, జెడ్పీటీసీ మాళక్షతు ప్రియాంక, ఎంపీడీవో రామకృష్ణ, గ్రామ సర్పంచ్ రావెళ్ల మాధవి, సుడా డైరెక్టర్ జంగాల శ్రీనివాస్, తేజావత్ రామోజీ తదితరులు పాల్గొన్నారు.