చింతకాని: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెగావ్యాక్సినేషన్ డ్రైవ్ను సక్సెస్ చేయాలని, జిల్లాలో వ్యాక్సినేషన్ పక్రియ నూరుశాతానికి చేర్చాలని ఖమ్మం జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో మత్కేపల్లి నామవరం గ్రామంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ను జడ్పీచైర్మన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.18ఏండ్లు వయసు దాటిన ప్రతిఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని,సెప్టెంబర్ 17నుంచి 19 వరకు పల్లె, పట్టణాల్లో ఏర్పాటు చేసిన మెగా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ను బాధ్యతగా స్వీకరించి వ్యాక్సినేషన్ పక్రియలో జిల్లాను నూరుశాతానికి చేర్చాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత కరోనా వ్యాక్సిన్ను పల్లెప్రజలు సద్వినియోగించుకోవాలని, పల్లెల్లో ప్రతిఒక్కరూ మాస్క్ధరిస్తూ సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి కోండలరావు, ఉపసర్పంచ్ దేవరగట్ల సునిత, పంచాయతి కార్యదర్శి బాబూరావు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.