ఎర్రుపాలెం: తెలంగాణ చిన్నతిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొపి, సర్వాంగాభిషేకాలు నిర్వహించి పట్టు వస్త్రాలు, పూలమాలలతో అలంకరించారు. శనివారం కావడంతో భక్తులు పాలపొంగుళ్లు చేసి స్వామివారికి నివేదించారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ విజయదేవశర్మ, జగన్మోహన్రావు, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, అర్చకులు సుదర్శనశాస్త్రీ, రామకృష్ణశాస్త్రీ, విజయదేవశర్మ, తదితరులు పాల్గొన్నారు.