కల్లూరు: కల్లూరులో సెంటర్ ఫర్ డవలప్మెంట్ యాక్షన్(సీడీఏ) ఆధ్వర్యంలో రూ.80వేల విలువైన కుట్టుమిషన్లను పంపిణీచేశారు. ప్రముఖ వైద్యులు వేము గంగరాజు చేతులమీదుగా వీటిని పెదమహిళలకు అందించారు. సీడీఏ ఆధ్వర్యంలో గత ఆరు నెలలుగా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తికావడంతో మహిళలు స్వయం ఉపాధి పొందేందుకు ఉచితంగా కుట్టుమిషన్లు అందించారు.
ఈ సందర్భంగా సీడీఏ కార్యదర్శి పి.యోనోస్కుమార్, ఈఎన్ఓఎస్హెచ్ సంస్థ నిర్వాహకులు చంద్రలీల, ప్రజాప్రతినిధులు మేకల కృష్ణ, కాటమనేని వెంకటేశ్వరరావు, వేము కృష్ణ, గంగవరపు వెంకటేశ్వరరావు, ఎస్.వెంకటేశ్వరరావు, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.