ఎర్రుపాలెం : మండలంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు, కేజీబీవీ, గురుకుల పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు ప్రారంభమైనట్లు ఎంఈవో వై.ప్రభాకర్ తెలిపారు. ఆయా పాఠశాలల్లో మొత్తం 3684 మంది విద్యార్థులకు గాను 1068 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మండలంలో 8 ప్రైవేటు పాఠశాలల్లో మొత్తం 1684 మంది విద్యార్థులకు గాను 238 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు.