ఖమ్మం :జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గోల్డ్మెడల్స్కు ఎంపికయ్యారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో ఎంబీఏ చదువుతున్న మాటేటి స్వప్న 2020-21 విద్యాసంవత్సరానికి ఫైనాన్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అంతేకాదు జేఎన్టీయూ స్ధాయిలో స్వప్న 8.4 గ్రేడింగ్ పాయింట్లతో టాపర్గా నిలిచింది.
గోల్డ్మెడల్ సాధించిన విద్యార్థినిని,అధ్యాపకులను ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్మన్ గుండాల కృష్ణ అభినందించారు. కళాశాల విద్యార్ధినికి గోల్డ్మెడల్ రావడం పట్ల కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ రాజ్కుమార్, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.