సత్తుపల్లి : తెలుగు అకాడమీ ఫిక్సిడ్ డిపాజిట్ల కుంభకోణంలో మండల పరిధిలోని గంగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగారం గ్రామానికి చెందిన మరీదు వెంకటేశ్వరరావు గత 20 ఏండ్ల క్రితం ఖమ్మం నుంచి వలసవచ్చి ఆర్ఎంపీడాక్టర్ గా పనిచేయడంతో పాటు రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో విశాఖపట్నానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంకటకోటి సాయికుమార్, తణుకుకు చెందిన వెంకటరమణలతో పరిచయం ఏర్పడటంతో సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో నకిలీ ఫిక్స్డ్ డిపాజిట్ల కుంభకోణంలో భాగస్వామి అయినట్లు సమాచారం.
అయితే ఈ కుంభకోణంలో వెంకటేశ్వరరావు పాత్ర ఏ మేరకు ఉంది..?ఇతర నిందితులతో పరిచయం ఎలా ..? ఏర్పడిందన్న అంశాలపై పోలీసులు ఆరాతీస్తున్నట్లు తెలిసింది.