ఖమ్మం : బాధితులకు భరోసా కల్పించేందుకు పిర్యాదులోని వాస్తవ పరిస్థితులను పరిశీలించి సమస్య పరిష్కరానికి కృషి చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజా దివాస్లో వచ్చిన పిర్యాదులు పరిశీలించి విచారించి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల పిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీస్ కమిషనర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పిర్యాదులో అధికంగా వృదాప్యంలో వారసులు పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అదేవిధంగా భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్థిక లావాదేవిలు, భార్య, భర్త ల సమస్యలపై వచ్చిన బాధితుల పిర్యాదులను పరిశీలించారు. పిర్యాదులపై వాస్తవ పరిస్థితులను పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ స్టేషన్ల లోని ఎస్హెచ్వోలకు ఆయన ఆదేశాలు జరీ చేశారు.