ఖమ్మం: నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు ఖమ్మంలో ప్రాపర్టీ షో జరుగనున్నది. నగరంలోని రాజ్పద్ ఫంక్షన్హాల్లో ఏర్పాటుచేయనున్నఈ షోను ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాపర్టీ షో జిల్లాలో మొదటి సారి నిర్వహిస్తుండటంతో నూతన గృహాలు, ఇండ్ల స్ధలాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు వీటికి సంబంధించిన సమగ్ర సమాచారం ఒకే వేదికపై లభించనున్నది.
జిల్లాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్ధలు, భవన నిర్మాణంలో అపార అనుభవం ఉన్నబిల్డర్లు ఈ ప్రాపర్టీషోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ద్వారా వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందించనున్నారు.
అలాగే ఇండ్ల స్ధలాలు, భవనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు నిబంధనలకు లోబడి రుణ సదుపాయం కల్పించేందుకు పలు జాతీయ బ్యాంకులు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొననున్నాయి. ఈ నెల 24వ తేది ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పాల్గొనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర, జిల్లా ప్రజా ప్రతినిధులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులు ప్రముఖులు పాల్గొంటారు.