ఖమ్మం : బాధితుల ఫిర్యాదుల వాస్తవ పరిస్థితులు పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ ఆదేశించారు. సోమవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దివస్ కార్యక్రమంలో బాధితుల నుంచి ఆయన ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులు తమ సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకంతో పోలీస్ స్టేషన్లకు వస్తారని వారందరి ఫిర్యాదులపై వాస్తవాలను పరిశీలించి తగినవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
చట్ట పరిధిలో వీలైనంత వేగంగా సమస్య పరిష్కరించాలని సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్థిక పరమైన అంశాలు, భూ అక్రమణలు, కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధిక సంఖ్యలో వచ్చాయి.