ఖమ్మం : నగరంలోని బాలల సదనం, శిశుగృహలో బుధవారం పోషణ్మాసోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులు, బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సీహెచ్ సంద్యారాణీ హజరయ్యారు. ఈ సందర్బంగా బాలల సదనం, శిశుగృహలో ఉన్నచిన్నారులకు, బాలికలకు ఆర్బీఎస్కే టీం ఆధ్వర్యంలో హిమోగ్లోబిన్ పరీక్షలు, జనరల్ హెల్త్ చెకప్లు చేశారు. ఈ సందర్బంగా డీడబ్యూఓ మాట్లాడుతూ బాలల సదనంలో 40 మంది చిన్నారులకు అవసరమైన వైద్య పరీక్షలు చేయించడం జరిగిందన్నారు.
పోషణ్ మాసోత్సవం పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ సంపూర్ణ ఆరోగ్యం, అందించేందకు అవసరమైన అవగాహన సదస్సులు కేంద్రాలలో జరుగుతున్నాయన్నారు. బాలల సదనంలో ఉన్నచిన్నారులకు మెరుగైన వైద్యం, నాణ్యమైన విద్యను అందించాలని ఆమె సూచించారు.
ఈ కార్యక్రమంలో సీడబ్యూసీ సబ్యుడు లక్ష్మయ్య, డీసీపీఓ టీ విష్ణువందన, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ హిమబిందు, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, బాలల సదనం పర్యవేక్షకురాలు వరలక్ష్మీ, మేనేజర్ హరిప్రసాద్, వైద్యుడు అరుణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.