ఖమ్మం : గర్బిణీలు, బాలింతలు పోషక విలువలతో కూడిన ఆహారాన్నే తీసుకోవాలని ఖమ్మం అర్బన్ ప్రాజెక్టు సీడీపీవో కవిత సూచించారు. పోషణ మాసంలో భాగంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండా సెక్టార్ పరిధిలోని రాంక్యాతండాలో సామూహిక సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. సొంతింటిని మైమరిపించేలా గర్భిణీ స్త్రీలకు సీమంతాలు నిర్వహించారు. గర్భిణీలకు గాజులు, పూలు, పండ్లు, చీరెలు పంపిణీ చేశారు.
పోషణమాసం ప్రతిజ్ఞ చేయించారు. గర్భిణీలు, బాలింతలు, 3నుంచి 6ఏండ్ల లోపు చిన్నారులు తప్పక పోషకాహారం తీసుకోవాలని సూచించారు. పోషణమాసం ప్రాముఖ్యతను తెలియజేస్తూ కూరగాయాలు, పండ్లు, పప్పుదాన్యాలు, గుడ్లు వంటి వాటితో చేసిన అలంకరణలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రామకృష్ణ, గ్రామ సర్పంచ్ అమాలి, ఉపసర్పంచ్ బిచ్చు, పాఠశాల హెచ్ఎం జయరాజు, సెక్టార్ సూపర్వైజర్ నజీమా బేగం, సెక్రటరీ గాంధీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.