వైరా: టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ పార్టీగా మారిందని టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఈ నెల 25న హైదరాబాద్లో జరగనున్న రాష్ట్ర ప్లీనరీని పురస్కరించుకొని వైరా నియోజకవర్గస్థాయి టీఆర్ఎస్ పార్టీ సన్నాహాక సమావేశం వైరా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ నామా నాగేశ్వరరావు ముఖ్యఅతిధిగా పాల్గొని మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. గడిచిన ఏడేళ్లలో యావత్ దేశం తెలంగాణ వైపు చూసేవిధంగా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు.
రైతులకు 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగానదే అన్నారు. పంటల సాగు కోసం పెట్టుబడి ఖర్చులకు రైతుబంధు పథకంతో ఎకరానికి రూ.10 వేలు చొప్పున ఇస్తున్నారన్నారు. ప్రమాదవశాత్తు మరణించే రైతు కుటుంబాలకు రైతుబీమాను అమలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు రాష్ట్రంలోని ప్రతి ఇంటికి వెళ్తున్నాయన్నారు. తెలంగాణ అభివృద్ధి ప్రదాతగా మారిన సీఎం కేసీఆర్ ప్రతిఒక్కరూ అండగా నిలవాలన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ మెజార్టీతో గెలిపించాలన్నారు. హైదరాబాద్లో జరిగే రాష్ట్ర ప్లీనరీ, వరంగల్లో జరగనున్న ప్రజాగర్జన భారీబహిరంగసభకు ప్రతి ఒక్కరూ తరలిరావాలన్నారు.
ప్రతి గులాబి సైనికుడు స్వచ్చంధంగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర మార్క్ఫైడ్ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి, స్వర్ణకుమారి, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, రైతుబంధుసమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, వైరా మార్కెట్ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఏన్కూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా లాలు, ఆత్మకమిటీ చైర్మన్ ముత్యాల నారాయణ, ఎంపీపీలు శంకుతల, సోని, పావని, మధు, జడ్పీటీసీలు జగన్, కళావతి, బుజ్జి, కనకదుర్గా, పోట్ల కవిత, పీఏసీఎస్ చైర్మన్లు దుగ్గినేని శ్రీనివాసరావు, చెరుకుమల్లి రవి, టీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, చౌడం నరసింహారావు, బాణోతు సురేష్, యండ్రప్రగడ చిరంజీవి, ధార్న రాజశేఖర్, శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, రైతుబంధు కన్వీనర్ గుగులోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.