ఖమ్మం : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సులలో అడ్మిషన్ల గడువును పొడిగించారు. రూ.200ల అపరాధ రుసుంతో ఈ నెల 28వ తేది వరకు గడువు పొడగించినట్లు ఖమ్మం రీజనల్ సెంటర్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ డీ.సమ్మయ్య మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు 7382929607లో సంప్రదించాలని కోరారు.