కొణిజర్ల : భారీవర్షాల కారణంగా జలమయమైన డబుల్బెడ్ రూం ఇండ్లను ట్రైనీకలెక్టర్ బీ.రాహుల్, ఆర్డీవో రవీంద్రనాథ్లు మంగళవారం పరిశీలించారు. లోతట్టు ప్రాంతాలకు చెందిన వారి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. జలమయమైన ఇండ్ల పరిసరాలను పరిశీలించి, పిల్లకాలువల ద్వారా నీటిని పక్కనే ఉన్న చెరువుకు తరలించాలని, వైరా మున్సిపాలిటీ నిధుల నుంచి మరమ్మతులు చేపట్టేందుకు సంబంధిత ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తహసీల్దార్ కృష్ణకు సూచించారు. ప్రతిఇంటి ముందు మట్టిపోయాలని, నీటిని మళ్లించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.