ఖమ్మం: నవంబర్ 6వ తేదీ నుంచి దివ్యమణికంఠ అన్నదాన సేవాసమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం ప్రారంభం అవుతుందని ట్రస్టు చైర్మన్ చిర్రా రవి తెలిపారు. బుధవారం నగరంలోని ముస్తఫానగర్ లో అన్నదానం షెడ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్బంగా రవి మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాలుగా ట్రస్టు ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు, అయ్యప్ప, భవానీ మాలలు ధరించిన స్వాములకు అన్నదానం చేయడం జరుగుతుందన్నారు.
ఈ ఏడాది కూడా నవంబర్ 6 నుంచి డిసెంబర్ 16వరకు అన్నదానం చేయాలని ట్రస్టు కమిటీ నిర్ణయం తీసుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు కార్యదర్శి పుట్టా మల్లికార్జున్, కోశాదికారి చెరుకూరి కోటేశ్వరరావు, స్థానిక కార్పొరేటర్ మందడపు మనోహర్రావు, బొమ్మా రాజేశ్వరరావు, కాంట్రాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర్లు, పుల్లంరాజు, డాక్టర్ కూరపాటి వెంకటేశ్వర్లుతో పాటు పలువురు ట్రస్టు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.