కల్లూరు: టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పార్టీ పునఃనిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్టీ పటిష్టతే లక్ష్యంగా శనివారం గ్రామాల్లో నూతన గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, రైతుసమన్వయ సమితి జిల్లా, మండల సభ్యులు పసుమర్తి చందర్రావు, లక్కినేని రఘు, ఏఎంసీ వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ నూతన కమిటీలను, అనుబంధ కమిటీలను వేయడం జరుగుతుందని తెలిపారు.
గ్రామస్థాయి నుంచి టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. 10వ తేదీలోగా గ్రామకమిటీలను పూర్తిచేసి మండల కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో నాయకులు పార్టీ పటిష్టతను దృష్టిలో ఉంచుకుని సమిష్టి నిర్ణయాలతో కమిటీలను ఏకగ్రీవం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్నకోరుకొండి, తెలగవరం, మర్లపాడు, పోచారం, తాళ్లూరు వెంకటాపురం గ్రామాల గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
తాళ్లూరు వెంకటాపురం గ్రామశాఖ అధ్యక్షునిగా మరీదు శ్రీనివాసరావు, కార్యదర్శిగా కందిమళ్ల సుదర్శనం, తెలగవరం గ్రామకమిటీ అధ్యక్షులుగా పాటి రామారావు, కార్యదర్శిగా నీలం వెంకటేశ్వర్లు, మర్లపాడు అధ్యక్షునిగా జగదభి సీతారామరాజు, కార్యదర్శిగా గర్నెపూడి పిచ్చయ్యలతో పాటు చిన్నకోరుకొండి, పోచారం గ్రామాల్లో నూతన కమిటీలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.