ఖమ్మం: తన తుది శ్వాస వరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పరితపించారని టీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం బాపూజీ పోరాటం చేశారని తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు.
తెలంగాణ సాధన కోసం మంత్రి పదవిని వదులుకున్న త్యాగశీలి అన్నారు. బాపూజీ చేసిన పోరాటానికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తుందన్నారు. బాపూజీ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.