కల్లూరు:మండల పరిధిలోని పుల్లయ్యబంజర గ్రామంలో విజయదశమి పర్వదినం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దేవీనరాత్రుల మండపం వద్ద అమ్మవారికి సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూజలు నిర్వహించారు. అనంతరం మండపం వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అమ్మవారి శుభాశిస్సులతో ప్రజలందరూ సుఖ, శాంతులతో వర్థిల్లాలని ఆకాంక్షించారు. ప్రజలకు ఆయన ఈసందర్భంగా విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐ కరుణాకర్, ఎస్సై రఫీ, ఎంపీపీ బీరవల్లి రఘు, జడ్పీటీసీ కట్టా అజయ్కుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాలెపు రామారావు, సర్పంచ్ పెద్దబోయిన కృష్ణవేణిమల్లేశ్వరరావు, డీసీసీబీ డైరెక్టర్ బోబోలు లక్ష్మణరావు, రైతుసమన్వయ సమితి ప్రతినిధులు డాక్టర్ అక్కినేని రఘు, పసుమర్తి చంద్రరావు, జడ్పీకోఆప్షన్సభ్యులు ఎం.డీ.ఇస్మాయిల్, వైస్ఎంపీపీ బుర్రి భవానీ, నరసింహారావు, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి కొరకొప్పు ప్రసాద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మేకల కృష్ణ, ఏఎంసీ డైరెక్టర్ కట్టా అర్లప్ప, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.