ఖమ్మం : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూత, కోచ్ల శ్రమను సద్వినియోగం చేసుకుని ఖమ్మం జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని క్రికెట్ క్రీడాకారులకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. నగరంలోని సర్ధార్ పటేల్ స్టేడియాన్నిసందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ క్రికెట్ అసోసియేషన్కు చెందిన అండర్-19 ఖమ్మం జిల్లా జట్టుకు ఎండీ మతీన్, వీరేష్గౌడ్ సారధ్యంలో గత కొన్ని రోజులుగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని అన్నారు.
ఈనెల 17 వరకు మూడు రోజులపాటు హన్మకొండలో జరుగనున్న వన్డే ఈస్ట్ జోన్ మ్యాచ్లో పాల్గొననుండటం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, సిరిపురపు సుదర్శన్రావు, పగడాల నాగరాజు, తాజుద్దీన్, మహిళా కార్పొరేటర్లు, రోటరీ క్లబ్ సభ్యులు కాళ్ల పాపారావు, వాసుదేవరావు, వెంకటప్రసాద్, నసీమ్ తదితరులు పాల్గొన్నారు.