ఖమ్మం: ఒలింపిక్ డే సందర్భంగా ఖమ్మంలో నిర్వహించిన ఒలింపిక్ రన్ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఖమ్మం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియం వద్ద క్రీడా జ్యోతిని వెలిగించి, జెండా ఊపి ఒలింపిక్ రన్ను ఆరంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అధికారి పరందామ రెడ్డి, ఒలింపిక్ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం సింగరేణి మండలం రేలకాయలపల్లిలో నిర్మించిన 24 డబుల్ బెడ్ రూం ఇండ్లను మంత్రి ప్రారంభించారు. రూ.120 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇండ్లను లబ్దిదారులకు అందజేశారు.