ఖమ్మం :రాష్ట మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఆదేశాల మేరకు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, అర్భన్ తహాశీల్దార్ శైలజలు నగరంలోని లో తట్టు ప్రాంతాలను సోమవారం రాత్రి పరిశీలించారు. 41వ డివిజన్లోని చెరువుబజార్, కవిరాజ్నగర్లోని తట్టు ప్రాంతాలను మేయర్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
మున్సిఫల్ కార్పొరేషన్ కు చెందిన డిఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. లకారం చెరువు ముంపు ప్రాంతాలో ప్లడ్లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అల్లీపురం, కొత్తగూడెం వెళ్లే దారిలో బారికేడ్లను ఏర్పాటు చేశారు. గంగమ్మ గుడి దగ్గర ఉదృతి ఎక్కువగా ఉండటం వల్ల ప్రజల శ్రేయస్సు కోసం బారకేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కర్నాటి కృష్ణ, నాయకులు సరిపూడి సతీష్, గోపి. సాయి కృష్ణ , శివ తదితరులు పాల్గొన్నారు.