ఎర్రుపాలెం: మండలంలోని రేమిడిచర్లగ్రామంలో కరోనా విజృంభిస్తున్నది. దీంతో గ్రామంలో 15రోజుల పాటు లాక్ డౌన్ విధించి, కంటైన్మెంటు జోన్ గా ప్రకటించారు. బనిగండ్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని రేమిడిచర్ల గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ రాజు ఆధ్వర్యంలో కరోనా పరీక్షలు,వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ రాజు మాట్లాడుతూ రేమిడిచర్ల గ్రామాన్ని కంటైన్మెంటు జోన్ గా ప్రకటించి15 రోజులు లాక్డౌన్ విధించడం జరిగిందన్నారు.
ప్రతిఒక్కరూ మాస్క్లు ధరించి భౌతికదూరం పాటించాలని, అత్యవసరమైతే తప్ప బయట తిరగొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పురుషోత్తం రాజు, ఎంపీటీసీ అప్పాయమ్మ, సూపర్వైజర్ జే.వెంకటేశ్వరరావు, హెల్త్అసిస్టెంట్లు సుధాకర్, శాయిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, ఏఎన్ఎం సరళ, సెక్రటరీ సువర్ణరాజు, ఆశాకార్యకర్తలు ఏసుమణి, రజిని, కమలమ్మ, అంగన్వాడీలు రాధమ్మ, గ్రామదీపిక దుర్గ, జ్యోతి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.