ముదిగొండ : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ106వ జయంతి ఉత్సవాలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. ముదిగొండ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరిప్రసాద్ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను భావితరాలకు తెలియ జేయాలన్నారు. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన బాపూజీ ఆశయం నెరవేరే వరకూ మడమ తిప్పలేదన్నారు.
ప్రాంతమా..? పదవా..? అన్నప్పుడు ఏమాత్రం సంకోచించకుండా పదవికి రాజీనామా చేసి పుట్టిన గడ్డ కోసం పోరాడరని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీఓ సూర్యనారాయణ, వెంకటాపురం సర్పంచ్ అనంతరాములు, ఏఎమ్సీ డైరెక్టర్ మల్లయ్య, పీఆర్ ఏఈ వెంకట కృష్ణ, ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.