ముదిగొండ: మండల పరిధిలోని వల్లభి గ్రామంలో మంగళవారం జల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్ పర్యటించారు. టీఆర్ఎస్ నాయకులు గంగయ్య సతీమణి ఇటీవల మరణించగా ఆయనను పరామర్శించారు. ఆ తరువాత ముదిగొండకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు సోందు సాహెబ్, హీమం సాహెబ్లు మరణించగా వారి కుటుంబ సభస్యులను పరామర్శించి ప్రగాడ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.