ఖమ్మం : ఖమ్మంజిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీఆర్ఎస్ లోక్సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు రేపు పర్యటించనున్నట్లు ఎంపీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పట్టణంలోని జాబ్లీపురలోని ఎంపీ క్యాంప్ ఆఫీస్ లో లబ్ధిదారులకు ఎంపీ నామా నాగేశ్వరరావు చేతుల మీదుగా సీఎంఆర్ఎప్ చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఖమ్మం నగర, మధిర , కొత్తగూడెంలోని రామవరం, చుంచుపల్లి మండలాల్లో పర్యటించనున్నారు. ఎంపీ పర్యటనలో గ్రామ, మండల జిల్లా, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.