“రాష్ట్రంలో కాంగ్రెస్ , బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాజకీయ లబ్ధి కోసమే ఆ పార్టీలు ఆరాటపడుతున్నాయి. మరో ఇరవై ఏళ్లు కేసీఆరే ముఖ్యమంత్రి” అని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. ఇల్లెందు, భద్రాచలంలో బుధవారం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్యతో కలిసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కమిటీలపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. పార్టీ పటిష్టతకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు.
భద్రాచలం, సెప్టెంబర్ 22: కార్యకర్తలే టీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. గ్రామ, మండల కమిటీల్లో ఎన్నికైన వారు 2023లో జరిగే సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా కృషి చేయాలని సూచించారు. టీఆర్ఎస్ పట్టణ, మండల, అనుబంధ సంఘాల కమిటీ ఎన్నిక కోసం భద్రాచలంలోని హరిత హోటల్లో రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు అధ్యక్షతన బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. భద్రాచలానికి ఎక్కువ నిధులిచ్చి అభివృద్ధి చేస్తానని అన్నారు. డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య మాట్లాడుతూ నూతన కమిటీల బాధ్యులు రానున్న ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి.. వాజేడు, వెంకటాపురం గ్రామ, మండల కమిటీలను ప్రకటించారు. వాజేడు మండల అధ్యక్షుడిగా పీ.రామకృష్ణారెడ్డి, కార్యదర్శిగా నరసింహారావు, వెంకటాపురం అధ్యక్షుడిగా గంపా రాంబాబు, కార్యదర్శిగా పిల్లారిశెట్టి మురళిని నియమించారు. చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం మండల కమిటీలను రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు గురువారం ప్రకటిస్తారని అన్నారు. చర్ల ఏఎంసీ చైర్మన్ బోదెబోయిన బుచ్చయ్య, టీఆర్ఎస్ నాయకులు పరుచూరి రవికుమార్, యశోద నగేశ్, అరికెల్ల తిరుపతి, సీనియర్ నాయకులు తిప్పన సిద్ధులు, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
ఇల్లెందు, సెప్టెంబర్ 22: మరో 20 ఏళ్లూ కేసీఆరే సీఎంగా ఉంటారని మంత్రి సత్యవతిరాథోడ్ స్పష్టం చేశారు. పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలు సైనికుల్లా కృషి చేయాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ మండల కమిటీ నియామకంలో భాగంగా ఇల్లెందులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ గ్రామ, మండల, పట్టణ కమిటీలదేనని అన్నారు. దేశానికి రోల్మోడల్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాద్రి, మహబూబాబాద్ జడ్పీ చైర్మన్లు కోరం కనకయ్య, బిందు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి, ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ హరిసింగ్నాయక్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, నాయకుడు పులిగళ్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.