చింతకాని, సెప్టెంబర్ 21: దళితబంధు పథకంతో దళితుల దిశ మారిందని, సీఎం కేసీఆర్తోనే దళితసాధికారిత సాధ్యమని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు స్పష్టం చేశారు. మండలంలోని గాంధీనగర్లో సర్పంచ్ కాళంగి లలిత, ఉప సర్పంచ్ తునికిపాటి కళావతి, టీఆర్ఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 30 కుటుంబాల వారు జడ్పీ చైర్మన్ సమక్షంలో మంగళవారం టీఆర్ఎస్లో చేరారు. అనంతరం సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి దళితులు, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని అన్నారు. దళితబంధు ప్రకటనతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై అనేక పార్టీల నుంచి నేతలు, ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. పభుత్వ పధకాలు, పేదల సంక్షేమానికి చేపడుతున్న చర్యలను చూసి ప్రతిపక్ష నాయకులు తట్టుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు. ప్రజలు వాస్తవ పరిస్థితులను గమనిస్తున్నారని అన్నారు. టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, వైస్ ఎంపీపీ గురజాల హనుమంతరావు, నాయకులు వంకాయలపాటి వెంకటలచ్చయ్య, నూతలపాటి వెంకటేశ్వర్లు, బొడ్డు వెంకట్రామారావు, కాళంగి డేవిడ్, తునికిపాటి పూర్ణయ్య, నారపోగు నాగయ్య, మర్రి ప్రకాశ్, సిలార్సాహెబ్, పిన్నెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.