కొత్తగూడెం, సెప్టెంబర్ 21: పార్టీ బలోపేతం కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్పాషాను నియమించామని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం ఉర్దూఘర్లో మంగళవారం జరిగిన నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. ఎవరూ పట్టించుకోని సమయంలో తానే ఉర్ధూఘర్కు స్థలమిచ్చి నిర్మాణం చేయించానని గుర్తుచేశారు. స్థానిక కౌన్సిలర్ విన్నపం మేరకు మరో రూ.15 లక్షల నిధులను ఉర్ధూఘర్కు కేటాయిస్తున్నట్లు చెప్పారు.
అన్వర్పాషా ప్రమాణ స్వీకారం..
ఉర్ధూఘర్, షాదీఖానా చైర్మన్ ఎస్కే అన్వర్పాషా ప్రమాణ స్వీకారం చేశారు. జిల్లా మైనారిటీ శాఖ అధికారి సంజీవరావు.. చైర్మన్తోపాటు సభ్యులు కమ్రాన్, జానీ, యాకూబ్, జరీనా, మజీద్, ఖుయ్యామ్లతో ప్రమాణం చేయించారు. కౌన్సిలర్ రాజానళిని జయంతి, వనమా రాఘవేంద్రరావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, మున్సిపల్ చైర్మన్ కాపు సీతాలక్ష్మి, సొసైటీ చైర్మన్ మండే వీరహనుమంతురావు, ఏఎంసీ చైర్మన్ రాంబాబు, ఆత్మకమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, గణేశ్ టెంపుల్ చైర్మన్ శంకర్బాబు, ఎంపీపీ బాదావత్ శాంతి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ పాల్గొన్నారు.
టీబీజీకేఎస్ సన్మానం
రామవరం, సెప్టెంబర్ 21: కొత్తగూడెం ఉర్దూఘర్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన అన్వర్పాషాను టీబీజీకేఎస్ నాయకులు సన్మానించారు.