చింతకాని, సెప్టెంబర్ 21: పల్లెల్లో నిరుపేదల గుండెల నిండా టీఆర్ఎస్సే ఉందనడానికి ప్రత్యక్ష తార్కాణం ఈ చిత్రం. ఇప్పటికే దళితబంధు రాకతో ఇప్పటికే సీఎం కేసీఆర్ను దేవుడిలా కొలుస్తున్నారు గ్రామీణ దళితులు. ఆయన దయతో తమ 70 ఏళ్ల దారిద్య్రం మరో పక్షం రోజుల్లో సమాప్తం కానుందని, తాము సొంత వ్యాపారాలు పెట్టుకునే స్థాయికి ఎదుగుతున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి చెందిన ఓ నిరుపేద దళితుడు టీఆర్ఎస్పైనా, గులాబీ జెండాపైనా చాటిన అభిమానం స్ఫూర్తిదాయకంగా నిలిచింది. దానిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ట్విట్టర్ ద్వారా రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేయడంతో అది విశేష ఆదరణ పొందింది.
మంత్రి అజయ్ ట్వీట్..
ఖమ్మం జిల్లా చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలోని నిరుపేద దళితుడు కాశిమల గురవయ్య. టీఆర్ఎస్ జెండా అంటే ఎనలేని అభిమానం. దీంతో దానిని తన గుడిసెపై కట్టుకున్నాడు. అది రెపరెపలాడుతోంది. తన అభిమాన నాయకుడు తన గుడిసెను గుడి చేస్తాడన్న నమ్మకంతో ఎదురుచూస్తున్నాడతను. దీంతో అతడి గుడిసెను, ఆ గుడిసెపై రెపరెపలాడుతున్న గులాబీ జెండాను గమనించి ముగ్ఢుడైన మంత్రి పువ్వాడ అజయ్కుమార్.. దానిని ట్విట్టర్లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ట్యాగ్ చేశారు.