కూసుమంచి, జనవరి 30: మహాత్మాగాంధీ ఆశయా లు అందరికీ స్ఫూర్తిదాయకమని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. కూసుమంచిలోని క్యాం పు కార్యాలయంలో ఆదివారం గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్, మండల అధ్యక్షుడు వీరయ్య, కార్యదర్శి ఆసీఫ్ పాషా, గ్రామ అధ్యక్షుడు సీతారాములు, భిక్షంనాయక్ పాల్గొన్నారు.
కూసుమంచి, జనవరి 30: కూసుమంచిలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సంఘం మండల అధ్యక్షుడు కొత్తూరు కిశోర్కుమార్, చౌడవరపు కృష్ణారావు, అర్వపల్లి సత్యనారాయణ, రామకృష్ణ, ఓటేటి కోటేశ్వరరావు, వేముల జనార్దన్ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం, జనవరి 30: ఎంపీడీవో కార్యాలయంలో గాంధీ చిత్రపటానికి ఎంపీపీ దేవరకొండ శిరీష, టీఆర్ఎస్ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, జడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్లు మొగిలి అప్పారావు, పురుషోత్తంరాజు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరెడ్డి, యూడీసీ వేణు, గొల్లపూడి వెంకటేశ్వరరావు, పుల్లారెడ్డి, నాగేశ్వరరావు, భాస్కర్రావు, రవి, సుధీర్బాబు, హుస్సేన్, చిరంజీవి పాల్గొన్నారు.
నేలకొండపల్లి, జనవరి 30: నేలకొండపల్లిలో ఆదివారం వాసవీక్లబ్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వాసవీక్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ రేగూరి హనుమంతరావు పాల్గొని మాట్లాడారు. జిల్లా ఆఫీసర్ దోసపాటి చంద్రశేఖర్, కొత్తా జనార్దన్రావు, తెల్లాకుల జయశ్రీ, తెల్లాకుల అశోక్, దోసపాటి రామకృష్ణ, గెల్లా కృష్ణారావు, చందా ప్రవీణ్కుమార్, కొత్తా కరుణ, ఈగ కన్యాకుమారి, గుప్తా రమాదేవి, తరుణ్, పసుమర్తి గురునాథం పాల్గొన్నారు.
మధిరరూరల్, జనవరి 30: ఎంపీడీవో కార్యాలయంలో గాంధీజీ విగ్రహానికి ఎంపీపీ మెండెం లలిత పూలమాల వేసి నివాళి అర్పించారు. శ్రీఆర్యవైశ్య కల్యాణ మండపంలో జాతిపిత విగ్రహానికి ఆర్యవైశ్య అధ్యక్షుడు రంగా వెంకటేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జంగా నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆవుల సంతోశ్కుమార్ పాల్గొన్నారు.
ఖమ్మం రూరల్, జనవరి 30: మండలంలోని కొండాపురం పంచాయతీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ బెల్లం ఉమ, జడ్పీటీసీ వరప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్, వైస్ ఎంపీపీ దరగయ్య, సుడా డైరెక్టర్ సంజీవరెడ్డి, ఆంజనేయులు, వెంకటేశ్వర్లు, శంకర్రాజు, తహసీల్దార్ సుమ, ఎస్సై శంకర్రావు పాల్గొన్నారు.
నేలకొండపల్లి, జనవరి 30: పైనంపల్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. డీసీఎంఎస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, సర్పంచ్ విజయలక్ష్మి, ఎంపీటీసీ లక్ష్మయ్య, పద్మారావు, వీరారెడ్డి, కనకారావు, సామేలు, సిద్దేశ్వరావు, షేక్ హుస్సేన్, చలమయ్య పాల్గొన్నారు.