వేంసూరు, జూలై 27 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన లక్ష్యం పేదల అభ్యున్నతేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక రైతువేదికలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను మంగళవారం అందజేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలు నేడు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను తీసుకొచ్చి బడుగు, బలహీనవర్గాలకు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వంపై కొందరు బురదజల్లే ప్రయత్నం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో తక్కువ కాలంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రేషన్ కార్డులు రాని వారు అధైర్యపడవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతాయన్నారు. రేషన్కార్డులు వచ్చినవారు ఆగస్టు నెల నుంచి రేషన్ షాపుల్లో సరుకులు పొందవచ్చునన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ మారోజు సుమలత, డీసీసీబీ డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, రైతు బంధు సమితి మండల కన్వీనర్ వెల్ది జగన్మోహన్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు పాలా వెంకటరెడ్డి, కంటే వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు గుత్తా శ్రీనివాస్, సర్పంచ్లు మందపాటి వేణుగోపాల్ రెడ్డి, మందపాటి సునీత, షేక్ నాగుల్మీరా, మేడా వెంకటేశ్వరరావు, ముసలయ్య, కొరకొప్పుల వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ నాయుడు వెంకటేశ్వరరావు, నున్నా రాంబాబు, శ్రీనివాసరెడ్డి, ఎంపీవో రంజిత్కుమార్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.