సత్తుపల్లి, జూలై 27 : అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అర్బన్పార్క్ను త్వరలో పూర్తిచేయాలని కలెక్టర్ వీ.పీ.గౌతమ్ అన్నారు. మంగళవారం ఆయన సత్తుపల్లిలో పర్యటించారు. తొలుత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసి ఆసుపత్రిలో రోగులు పొందుతున్న సౌకర్యాలను పరిశీలించి వైద్యులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పథకాలపై గ్రామస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. అనంతరం అర్బన్పార్క్లో మొక్కనాటి వాకర్స్తో మాట్లాడారు. కిష్టారంలో బృహత్ పల్లెప్రకృతివనాన్ని పరిశీలించి ఆగస్టు రెండోవారం కల్లా పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎఫ్డీవో వేమూరి సతీశ్కుమార్, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మీనన్, ఎండీవో చిట్యాల సుభాషిణి, ఆర్ఐలు విజయభాస్కర్, జగదీశ్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో తలారి సీతారాం, ఖమ్మం ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, సర్పంచ్ శెట్టిమాల రేణుకాఈశ్వర్, వైద్యులు వసుమతి దేవి, కిరణ్, శివకృష్ణ, రేంజర్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, స్పెషల్ ఆఫీసర్ ధన్రాజు, ఏపీవో బాబురావు, ఎంపీటీసీలు పాలకుర్తి సునితారాజు, ఇరపా కృష్ణారావు, వైద్య, అటవీసిబ్బంది తదితరులు పాల్గొన్నారు.