కూసుమంచి, కొత్తగూడెం జూలై 20 : పథకాల లక్ష్యం నెరవేరాలంటే అర్హులకు సంక్షేమ ఫలాలు అందాలని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్లో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వర్రావు, కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చ జరిగిన అనంతరం నియోజకవర్గ సమస్యలు డబల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై సమీక్షించారు. ప్రభుత్వం త్వరలో ప్రవేశ పెట్టే దళిత బంధుతోపాటు పెండింగ్ సమస్యలపైన మాట్లాడినట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. సింగరేణి ఏరియాల్లో సమస్యలపై చర్చించారు. కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధికి రూ.150కోట్లు, మెడికల్ కాలేజ్కు రూ.700 కోట్లు, జిల్లాలో త్వరలో కలక్టరేట్ నూతన భవనం ప్రారంభంపై ఎమ్మెల్యే వనమాతో మాట్లాడారు. సమీక్షలో సీఅండ్ఎండి శ్రీధర్తోపాటు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, ఇతర కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.