ఖమ్మం : కొవిడ్ -19 రోగులకు మెడికల్ ప్రిస్క్రిప్షన్లను స్పష్టమైన రీతిలో రాయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ వైద్యులను కోరారు. కెమిస్ట్స్, ఫార్మాసిస్ట్స్తో కలెక్టర్ శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొవిడ్ రోగులకు యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, కోగ్యులెంట్స్, బ్లడ్ తిన్నర్ డ్రగ్స్ను అమ్మవద్దని ఆదేశించారు. ప్రతి ఫార్మసీ యజమాని కొవిడ్ -19 ప్రోటోకాల్లను ఖచ్చితంగా పాటించాలన్నారు. రోగులకు వైద్యులు సూచించిన డ్రగ్స్ వాడకాన్ని వివరించాలన్నారు. అదేవిధంగా ఎంఆర్పీ రేట్ల కంటే మందులను ఎక్కువ ధరకు అమ్మరాదన్నారు.
ఫార్మసీని డ్రగ్ ఇన్స్పెక్టర్ను తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. దుకాణంలో పనిచేసే సిబ్బంది తప్పనిసరిగా కొవిడ్-19 నెగెటివ్ అయి ఉండాలన్నారు. షాపుకు రాలేని రోగుల ఇంటి వద్దకే మందులను పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్లో అమ్మితే ప్రజలు 1077 లేదా 100కు డయల్ చేసి చెప్పాలని కోరారు. బ్లాక్ మార్కెట్ విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.