ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు24,216 మందికి కరోనా
పాజిటివ్ వస్తే కంగారు వద్దు..
మరణాల రేటు కేవలం 1.01 శాతం మాత్రమే..
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 22: కరోనా అనే మాట వింటేనే ప్రపంచం వణికిపోతున్నది. ‘సెకెండ్ వేవ్’ అనే పదం వినిపిస్తేనే యావత్ దేశం గజగజలాడుతున్నది. అయితే..కరోనా ప్రాణం తీస్తుందా..? దానికి మనిషి ఆయువును తీసేంత శక్తి ఉందా..? అనే కోణంలో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతున్నప్పటికీ గతేడాది పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటున్న వైద్య నిఫుణులు మాత్రం ‘డోన్ట్ వర్రీ’ అంటున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు, మానసిక ఒత్తిడికి గురైన వారు మాత్రమే కన్నుమూశారంటున్నారు. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నవారు అనతికాలంలోనే ఆరోగ్యవంతులవుతున్నారన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ గణాంకాలను పరిశీలిస్తే కొవిడ్ తీవ్రత అవగతం అవుతుంది.
మరణాల రేటు చాలా తక్కువ..
‘అదిగో పులి అంటే ఇదిగో తోక..’ అనే చందాన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఎందరో సామాన్యులు సామాజిక బహిష్కరణకు గురైన రోజులు కళ్లముందే ఉన్నాయి. కేంద్రం విధించిన లాక్డౌన్, రెడ్ జోన్స్, కంటైన్మెంట్ జోన్స్ అనే పదాలు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. మళ్లీ ఇన్నాళ్లకు ‘సెకెండ్ వేవ్’ ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. వైద్యారోగ్యశాఖ గణాంకాల ప్రకారం గతేడాది నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 3,54,000 మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోగా 24,216 మందికి పాజిటివ్ తేలింది. మరణాల రేటు కేవలం 1.01 శాతమే నమోదైంది.
ఇవి కూడా చదవండి
నకిలీ రెమ్డిసివిర్ రాకెట్ గుట్టురట్టు : నర్స్ సహా ఐదుగురు అరెస్ట్
ట్రక్కు డ్రైవర్ గా రకుల్ప్రీత్సింగ్